న్యూఢిల్లీ: పెరోల్పై విడుదలైన ఖైదీలపై ట్రాకింగ్ పరికరాలతో నిఘా ఉంచాలని రాష్ర్టాలకు కేంద్రం సూచించింది. కరడు గట్టిన నేరగాళ్లను ఇతర ఖైదీలతో వేరు చేసి ప్రత్యేక సెల్లో ఉంచాలని సలహా ఇచ్చింది.
మే నెలలోనే విడుదలైన ఈ మార్గదర్శకాలు సోమవారం హోంశాఖ వెబ్సైట్లో ప్రచురించారు. ‘ట్రాకింగ్ పరికరాలను ఉపయోగించి పెరోల్పై వెళ్లే ఖైదీలపై నిఘా ఉంచొచ్చు. వారు నిబంధనలను అతిక్రమిస్తే పెరోల్ను రద్దు చేయవచ్చు’ అని హోంశాఖ తెలిపింది.