న్యూఢిల్లీ: ప్రపంచంతోపాటు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుంటడం, కరోనా థర్డ్ వేవ్పై భయాందోళన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హోమ్ ఐసొలేషన్ నియమాలను సవరించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హోమ్ ఐసొలేషన్కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది. స్వల్ప లక్షణాలుండి పాజిటివ్గా నిర్ధారణ అయిన వ్యక్తులు ఏడు రోజులపాటు హోమ్ ఐసొలేషన్లో ఉంటే చాలని తెలిపింది. ఏడు రోజుల తర్వాత లేదా వరుసగా మూడు రోజులపాటు జ్వరం లేనట్లతేనే హోమ్ ఐసొలేషన్ను ముగించవచ్చని చెప్పింది. అలాగే హోమ్ ఐసొలేషన్ గడువు ముగిసిన తర్వాత మరోసారి కరోనా టెస్ట్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఒమిక్రాన్ సోకిన రోగులకు ఆసుపత్రిలో చేరేంతగా అనారోగ్య పరిస్థితి లేకపోవడంతో వైద్య మార్గదర్శకాల మేరకు కనీసం వారం రోజులు హోమ్ ఐసొలేషన్లో ఉండాలని సూచించింది. ఇప్పటి వరకు ఇది పది రోజులు వరకు ఉండగా తాజాగా దీనిని కుదించింది.
కేంద్రం జారీ చేసిన హోమ్ ఐపొలేషన్ కొత్త మార్గదర్శకాలు: