జోధ్పూర్, అక్టోబర్ 3: స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్(ఎల్సీహెచ్) ‘ప్రచండ్’ భారత వాయుసేన అమ్ములపొదిలోకి చేరింది. రాజస్థాన్లోని జోధ్పూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నాలుగు ప్రచండ్ హెలికాప్టర్లను వాయుసేనలో ప్రవేశపెట్టారు. ఈ హెలికాప్టర్లను ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) అభివృద్ధి చేసింది. 1999 కార్గిల్ యుద్ధం తర్వాత ఇటువంటి తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల అవసరాన్ని గుర్తించిన నేపథ్యంలో ప్రచండ్ను అభివృద్ధి చేశారు. ప్రధానంగా వీటిని పర్వత ప్రాంతాల్లో కార్యకలాపాల కోసం వినియోగిస్తారు.
‘ప్రచండ్’ విశేషాలు