లక్నో: ఉత్తరప్రదేశ్లోని (Uttar pradesh) బాఘ్పట్లో హోలీ (Holi) వేడుకలు పలువురి ప్రాణం మీదికి తెచ్చాయి. బాఘ్పట్లో ప్రజలు హోలీ పండుగను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు యువకులు రోడ్డుపై వెళ్తున్నవారిపై రంగులు గుప్పుతున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులతో నిండుగా ఉన్న ఓ ఆటో వేగంగా వెళ్తున్నది. యువకులు నీళ్లతో కూడిన బెళూన్లను దానిపైకి విసిరేశారు. డ్రైవర్ భయపడటంతో అదుపుతప్పిన ఆటో బోల్తా పడింది. దీంతో యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారనే విషయంపై స్పష్టటలేదు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేశామని పోలీసులు చెప్పారు. యువకుల కోసం గాలిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా రంగుల పండుగను శుక్రవారం నిర్వహించారు. అయితే కొన్ని ప్రాంతాల ప్రజలు శనివారం కూడా పండుగ చేసుకున్నారు.