Supreme Court | జ్ఞానవాపి కేసులో హిందూ పక్షం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గతేడాది మే 19న ఇచ్చిన ఉత్తర్వులను మార్చాలని కోర్టును కోరింది. దాంతో శివలింగం ఉన్నట్లుగా భావిస్తున్నట్లు ప్రదేశంలో సర్వేపై నిషేధాన్ని ఎత్తివేసేందుకు మార్గం సుగమంకానున్నది. జ్ఞానవాపిలో శివలింగం ఉన్నట్లు చెబుతున్న స్థలంలో సర్వే నిర్వహించాలని పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ (ASI)ని ఆదేశించాలని పిటిషన్లో డిమాండ్ చేశారు. దీంతో పాటు ఆవరణలో కొత్తగా నిర్మించిన గోడలు, పైకప్పులను తొలగించిన తర్వాతే సర్వే నిర్వహించాలని వినతిపత్రంలో కోరారు. అంతే కాకుండా సీల్ చేసిన ఇతర స్థలాల్లో కూడా తవ్వకాలు, ఇతర శాస్త్రీయ పద్ధతుల ద్వారా సర్వేలు నిర్వహించి నివేదికను కోర్టుకు అందించాలన్నారు.