BJP MLA on Hindu Rashtra | భారత్ను హిందూ దేశంగా మార్చాలన్న తన పిలుపును హర్యానాలో అధికార బీజేపీ ఎమ్మెల్యే అశీమ్ గోయల్ సమర్థించుకున్నారు. అలాగని ముస్లింలు, ఇతర సామాజిక వర్గాల వారిని మినహాయించడం కాదన్నారు. భారత్ను హిందూ దేశం (హిందూ రాష్ట్రం)గా మార్చాలని ఆయన ఇటీవల ప్రతిజ్ఞ చేశారు.
మేవార్ రాజు మహారాణ ప్రతాప్ జయంతి సందర్భంగా బుధవారం సాయంత్రం అంబాలాలోని ముల్లానాలో జరిగిన సభలో మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యానించారు. హిందూ దేశం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు.
హిందూ రాష్ట్రం అంటే ముస్లింలు, ఇతర సామాజిక వర్గాలకు చోటు లేదని కాదు. విశ్వాసాలు, మతాల వారిని కలుపుకోవడానికే ఈ భావన అని అశీమ్ గోయల్ అన్నారు. హిందూ దేశం అంటే హిందూయేతరులకు చోటు లేదని కాదన్నారు.