ముజఫర్నగర్, ఆగస్టు 17: జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే ఫొటోతో అఖిల భారతీయ హిందూ మహాసభ తిరంగా మార్చ్ చేపట్టింది. ఓ వాహనంపై గాడ్సే పెద్ద ఫొటో పెట్టి ఊరేగింపు చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో ఈ ఘటన చోటుచేసుకున్నది. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ఇది జరగడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. పైగా, గాడ్సే విప్లవకారుడు అంటూ హిందూ మహాసభ నేతలు వర్ణించారు.
యోగేంద్ర వర్మ మాట్లాడుతూ యాత్రలో పలువురు విప్లవకారులు ఫొటోలు పెట్టామని, అందులో గాడ్సే కూడా ఒకరని అన్నారు. మహాత్మాగాంధీ అనుసరించిన విధానాల వల్లే గాడ్సే ఆయన్ను హత్య చేయాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.