న్యూఢిల్లీ : కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాధ్ సింగ్ల కుమారులను ప్రస్తావిస్తూ బీజేపీ నేతలవి వారసత్వ రాజకీయాలు కాదా అని ప్రశ్నించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Sarma) దీటుగా బదులిచ్చారు. రాహుల్కు రాజకీయాలు తెలియవని, ఆయన చదువులేని బచ్చా అని మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జే షా బీసీసీఐ పదవిలో కొనసాగుతుండగా, మరో కేంద్ర మంత్రి రాజ్నాధ్ సింగ్ యూపీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తుండగా వీరిని ఉద్దేశించి రాహుల్ మిజోరాం ఎన్నికల ప్రచారం సందర్భంగా కాషాయ పార్టీపై విమర్శలు గుప్పించారు.
అమిత్ షా కొడుకు భారత్లో క్రికెట్ను నడిపిస్తున్నారని, అలాగే రాజ్నాధ్ సింగ్ కొడుకు యూపీ రాజకీయాల్లో ఉన్నారని వారసత్వ రాజకీయాల విషయంలో గాంధీ కుటుంబాన్ని విమర్శించే కాషాయ పార్టీ దీనికి ఏం సమాధానం చెబుతుందని రాహుల్ నిలదీశారు. రాహుల్ వ్యాఖ్యలపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ దీటుగా స్పందిస్తూ అమిత్ షా కొడుకును ఎందుకు తెరపైకి తీసుకువచ్చారని ప్రశ్నించారు.
అమిత్ షా కొడుకు రాజకీయాల్లో లేడని, కానీ రాహుల్ కుటుంబం మొత్తం రాజకీయాల్లో ఉందని అన్నారు. బీసీసీఐ బీజేపీ విభాగం అని రాహుల్ అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. రాజ్నాధ్ సింగ్ కుమారుడు యూపీలో కేవలం ఓ ఎమ్మెల్యే మాత్రమేనని, అతడిని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో పోల్చగలమా, ఆయన బీజేపీని కంట్రోల్ చేసే స్ధాయిలో ఉన్నాడా అని శర్మ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ముందుగా కొత్తవారికి అవకాశాలు అప్పగించి ఆపై వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడాలని హితవు పలికారు.
Read More :
Israel-Hamas War | రాకెట్ ప్రయోగానికి ముందు, ఆ తర్వాత.. గాజా ఆసుపత్రి ఇలా.. VIDEO