గువాహటి: అస్సాం సీఎం పదవికి హిమంత బిశ్వ శర్మ బుధవారం రాజీనామా చేశారు. అయితే కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య హిమంతను కోరారు. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఈ నెల 11న ఉండొచ్చని హిమంత తెలిపారు.
పార్టీ కేంద్ర పరిశీలకుడు జేపీ నడ్డా శాసససభా పక్షం సమావేశం తేదీని నిర్ణయిస్తారు. ఆ సమావేశంలోనే కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తారు. హిమంత తాజా ఎన్నికల్లో అత్యుత్తమ పనితీరు కనబరచినప్పటికీ ఆయన్నే మళ్లీ సీఎం అవుతారా లేదా అనే విషయాన్ని బీజేపీ అధిష్ఠానం ఇంకా స్పష్టం చేయలేదు. గతంలో సర్బానంద సోనోవాల్ను పార్టీ మార్చిన నేపథ్యం ఈ సారి సీఎం మార్పుపై ఊహగానాలకు తావిచ్చింది.