ఓ వైపు కరోనా తీవ్రతతో దేశం అల్లాడుతోంది. ఇంకోవైపు అకాల వర్షాలు, హిమపాతం హిమాచల్ ప్రదేశ్ ని వణికించేస్తున్నాయి. కిన్నౌర్ జిల్లాలోని రాలి ప్రాంతంలో ఎన్హెచ్ 5 ని హిమపాతం కారణంగా మూసివేశారు.
ఇక సిమ్లాలోని సంజౌలి ప్రాంతంలో ఐదు అంతస్తుల భవనం కూలిపోయింది. భారీ వర్షాల కారణంగా ఈ భవనం కూలినట్లు తెలుస్తోంది. సంఘటన జరిగిన సమయంలో భవనం ఖాళీగా ఉందని తెలుస్తోంది.