షిమ్లా: హిమాచల్ప్రదేశ్లో ఘోరం జరిగింది. చలి నుంచి ఉపశమనం కోసం వేసుకున్న మంట కూలీల పాలిట శాపమయ్యింది. షిమ్లా జిల్లాలోని కోట్గఢ్ ఏరియాలో 9 మంది కూలీలు ఒకే గదిలో ఉంటున్నారు. వాతావరణం బాగా చలిగా ఉండటంతో ఇవాళ తెల్లవారుజామున గదిలోనే బొగ్గులతో చలిమంట వేసుకున్నారు.
ఆ చలిమంటే వాళ్ల పాలిట మృత్యుపాశంగా మారింది. మంట చల్లారిపోయి గదినిండా పొగ అలుముకుంది. దాంతో కూలీలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎట్టకేలకు అందరూ ఎలాగోలా గది తలుపులు తీసుకుని బయపడ్డారు. కానీ కాసేపటికే వారిలో ఇద్దరు శ్వాస ఆడక మరణించారు. మిగతా ఏడుగురు తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అంతకుముందు ఘటనపై సమాచారం అందగానే స్థానిక పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. అనంతరం ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.