సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించి ప్రభుత్వ ఏర్పాటు దిశగా సాగుతుండటంతో సీఎం జైరాం ఠాకూర్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ప్రజా తీర్పును గౌరవిస్తామని, సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్టు జైరాం ఠాకూర్ పేర్కొన్నారు.
గవర్నర్కు రాజీనామా సమర్పిస్తానని పేర్కొన్నారు. ప్రజా ఆకాంక్షలను తాను గౌరవిస్తానని, రాష్ట్ర ప్రభుత్వానికి గత ఐదేండ్లుగా సహకరించిన ప్రధాని, కేంద్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. పార్టీలకు అతీతంగా తాము రాష్ట్ర పురోగతికి తాము సహకరిస్తామని స్పష్టం చేశారు.
రాబోయే కాలంలో తమ లోపాలను సమీక్షించుకుని మెరుగైన పనితీరుతో ప్రజల ముందకు వస్తామని చెప్పారు. ఇక 68 స్ధానాలు కలిగిన హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ 38 స్ధానాల్లో ఆధిక్యంలో ఉండగా పాలక బీజేపీ 27 స్దానాల్లో ముందంజలో ఉంది. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 35 స్ధానాలకు కాంగ్రెస్ చేరువైంది.