షిమ్లా: హిమాచల్ప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులైనా కాకముందే ప్రజలకు పన్నుల వడ్డన మొదలుపెట్టింది. డీజిల్పై లీటర్కు రూ.3 చొప్పున వ్యాట్ చార్జీలను పెంచింది. పెంచిన వ్యాట్ చార్జీలు అన్ని ఏరియాల్లోని పెట్రోల్ పంపుల్లో ఒకేవిధంగా ఉండవని, ఏరియాను బట్టి పెంచిన వ్యాట్ చార్జీల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయని పేర్కొన్నది.
అయితే, డీజిల్పై రూ.3 చొప్పున వ్యాట్ చార్జీలు పెంచిన హిమాచల్ సర్కారు పెట్రోల్పై మాత్రం లీటర్కు రూ.0.55 చొప్పున వ్యాట్ చార్జీలను తగ్గించింది. పెట్రోల్పై తగ్గించిన వ్యాట్ చార్జీలు కూడా అన్ని పెట్రోల్ పంపుల్లో ఒకేలాగ కాకుండా ఏరియాను బట్టి హెచ్చుతగ్గులు ఉన్నాయని తెలిపింది.