షిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ సమావేశం కొనసాగుతున్నది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు మొదలైన సీఎల్పీ భేటీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు నాయకుడు ఎవరో ప్రకటించే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం కూడా సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తమ నాయకుడి పేరును ఖరారు చేసే బాధ్యతను ఎమ్మెల్యేలు పార్టీ హైకమాండ్కు కట్టబెట్టారు.
దాంతో కాంగ్రెస్ హైకమాండ్ హిమాచల్ పీసీసీ మాజీ అధ్యక్షుడు సుఖ్విందర్ సింగ్ సుఖు పేరును సీఎంగా ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుఖ్విందర్ సింగ్ పేరుకు సీఎంగా ఆమోదముద్ర వేసిన హైకమాండ్.. ఇవాళ్టి సీఎల్పీ భేటీలో అధికారికంగా ప్రకటన చేయాలని పార్టీ కేంద్ర పరిశీలకులను ఆదేశించినట్లు తెలుస్తున్నది.
దాంతో, ఇవాళ మరోసారి సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. సుఖ్విందర్ సింగ్ సుఖు పేరును సీఎంగా హైకమాండ్ ప్రకటించిందని ఈ సమావేశంలో కేంద్ర పరిశీలకులు ఎమ్మెల్యేలకు తెలిపే అవకాశం ఉన్నది. దానికి ముందు వారు సీఎం పదవిని ఆశిస్తున్న ఇతర నేతలకు నచ్చజెప్పనున్నారు. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి రాజీవ్ శుక్లా, ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ సమక్షంలో ఈ సమావేశం జరుగుతున్నది.
Himachal Pradesh | Congress CLP meeting underway in Shimla
Congress Himachal Pradesh in-charge Rajeev Shukla, Chhattisgarh CM Bhupesh Baghel, Himachal Pradesh Congress Chief Pratibha Virbhadra Singh and others present in the meeting. pic.twitter.com/QUB0GdmMyI
— ANI (@ANI) December 10, 2022