Sukhwinder Singh Sukhu | హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి (Himachal Pradesh CM) సుఖ్విందర్ సింగ్ సుఖు (Sukhwinder Singh Sukhu) అస్వస్థతకు గురయ్యారు. బుధవారం అర్ధరాత్రి కడుపునొప్పి (Pain in Abdomen) రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన సీఎంను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ (IGMC)లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా సీఎం అస్వస్థతకు గురైనట్లు సంబంధిత అధికారులు గురువారం వెల్లడించారు.
కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు సిమ్లాలోని ఐజీఎంసీలో చేరినట్లు సీనియర్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ రావు తెలిపారు. సీఎంకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. అల్ట్రాసౌండ్ రిపోర్ట్ సహా అన్ని పరీక్షల్లోనూ అంతా నార్మల్గానే ఉందని పేర్కొన్నారు. సీఎం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ప్రస్తుతం ఆయన్ని అబ్జర్వేషన్లో ఉంచినట్లు తెలిపారు.
Also Read..
Czech Influencer | మిలియన్ డాలర్ల సొమ్మును హెలికాఫ్టర్ ద్వారా జారవిడిచిన ఇన్ఫ్లుయెన్సర్.. వీడియో
Anchor Suma | మీడియాను నిండుమనసుతో క్షమాపణలు కోరిన యాంకర్ సుమ