PM Modi : భారత్ – పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారం త్రివిధ దళాధిపతులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రధాని నివాసంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) అనిల్ చౌహాన్ (Anil Chauhan), రక్షణశాఖ మంత్రి (Difence Minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) తదితరులు పాల్గొన్నారు.
ఈ ఉన్నతస్థాయి సమావేశానికి కొన్ని గంటల ముందే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సైతం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. భారత్ – పాక్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో దోవల్ వరుసగా ప్రధానితో చర్చలు జరుపుతున్నారు. ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడితో భారత్, పాక్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
ఈ క్రమంలోనే ‘ఆపరేషన్ సిందూర్’ (operation sindoor) పేరుతో పాక్లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై భారత్ ఆర్మీ దాడులు చేసింది. ఈ దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులు మృతిచెందారు. దాంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.