న్యూఢిల్లీ: ప్రైవేటు రంగం ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం కోటాను తప్పనిసరి చేస్తూ హర్యానా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని పంజాబ్-హర్యానా హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమైనదిగా న్యాయస్థానం పేర్కొన్నది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మనోహర్లాల్ ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇది గట్టి ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును 2020లో అసెంబ్లీలో ఆమోదించారు.