అహ్మదాబాద్: ‘మీరు రక్షకభటులా? లేదా ప్రజల కష్టాన్ని భక్షించే నేరస్థులా?’ అని పోలీసులపై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రక్షించాల్సిన పోలీసులే నేరాలు చేస్తుండటం ఆందోళన కలిగిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేసింది. అహ్మదాబాద్ పోలీసులు, ఓ జవాన్ కలిసి అర్ధరాత్రి దంపతులను బెదిరించి రూ.60 వేలు వసూళ్లకు పాల్పడిన ఘటనపై దాఖలైన పిల్ను గుజరాత్ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈనెల 20న జరగనున్న తదుపరి విచారణ నాటికి పూర్తి స్థాయిలో దర్యాపు చేసి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.