న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని ఆర్ఎస్ పురా సెక్టార్ ప్రాంతంలో రూ.40 కోట్లకు పైగా విలువైన 6.5 కిలోల హెరాయిన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన డ్రోన్ వీటిని జారవిడిచినట్టు అనుమానిస్తున్నారు. శుక్రవారం రాత్రి అనుమానిత డ్రోన్ కదలికలను స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు బీఎస్ఎఫ్ దళాలతో కలిసి ఆ ప్రాంతంలో తనిఖీలు చేశారు. కాగా, కథువా జిల్లాలో హెరాయిన్ను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలతో ఇద్దరు అరెస్టయ్యారు. వీరికి పాకిస్థాన్లోని స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు.