న్యూఢిల్లీ, జనవరి 16: వాహనదారులు తమ ఫాస్టాగ్లను ఈ నెల 31లోగా కేవైసీ చేయించుకోవాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ఒక ప్రకటనలో కోరింది. అలా చేయకపోతే అవి డీ యాక్టివేట్ అవుతాయని పేర్కొంది. ఒకే ఫాస్టాగ్ను బహుళ వాహనాలను వినియోగించకుండా అరికట్టడానికి ‘ఒకే ఫాస్టాగ్.. ఒకే వాహనం’ విధానం అమలుకు దీనిని తెచ్చినట్టు చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఫాస్టాగ్ చేయించుకున్న ఖాతాలు మాత్రమే క్రియాశీలకంగా ఉంటాయని, పాతవన్నీ జనవరి 31 తర్వాత రద్దవుతాయని ఆ ప్రకటనలో పేర్కొంది. చాలా వాహనాలకు ఒకటి కంటే ఎక్కువ ఫాస్టాగ్లు ఉన్నట్టు గుర్తించామని, కేవైసీ లేకుండా ఫాస్టాగ్ చేయడం ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది.