Hemant Soren | న్యూఢిల్లీ : దాదాపు 30 గంటల పాటు ఎవరికీ కనిపించికుండా పోయిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ చివరకు రాంచీ చేరుకున్నారు. అయితే హేమంత్ సోరెన్ అదృశ్యం వెనుక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హస్తం ఉందని బీజేపీ నాయకుడు నిషికాంత్ దూబే ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. హేమంత్ సోరెన్, కేజ్రీవాల్ ఇద్దరూ దొంగలు అని దూబే విమర్శించారు.
హేమంత్ సోరెన్ తిరిగి రాంచీ చేరుకోవడానికి కేజ్రీవాల్ సహాయం చేసినట్లు తమకు సమాచారం అందిందని దూబే తన ట్వీట్లో పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి వారణాసికి చేరుకున్న సోరెన్ను, అక్కడ్నుంచి జార్ఖండ్కు మంత్రి ఒకరు రాంచీకి తీసుకెళ్లారని ఆరోపించారు. కేజ్రీవాల్, హేమంత్ కలిసి కుట్రలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమంత్ సోరెన్ను విచారించేందుకు ఈడీ అధికారులు ఢిల్లీలోని ఆయన నివాసానికి సోమవారం వెళ్లిన సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి వరకు అధికారులు ఆయన కోసం ఎదురుచూశారు. కానీ సోరెన్ ఇంటికి రాలేదు. దీంతో సోరెన్కు చెందిన రెండు కార్లు, రూ. 36 లక్షల నగదు, కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి రాంచీకి సోరెన్ చేరుకున్నారు.
जानकारी के अनुसार झारखंड के मुख्यमंत्री हेमंत सोरेन जी को दिल्ली से रॉंची भगाने में दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल ने सहयोग किया ,यह सहयोग वाराणसी तक था,वाराणसी से रॉंची मंत्री मिथलेश ठाकुर जी ले गए । चोर चोर मौसेरे भाई
— Dr Nishikant Dubey (@nishikant_dubey) January 30, 2024