రాంచీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు సహకరిస్తామని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు. తమ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) టీఎంసీకి మద్దతు ఇస్తుందని శుక్రవారం చెప్పారు. బెంగాల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటీకి నిలుపడం లేదని తెలిపారు. బీజేపీని ఓడించేందుకు మమతకు మద్దతిస్తామని సోరెన్ స్పష్టం చేశారు.
కాగా, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆర్జేడీ నేత తేజస్వి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఇప్పటికే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతకు మద్దతిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.