శ్రీ విజయపురం : ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఓ సంస్థ నడిపే హెలికాప్టర్ మంగళవారం అండమాన్ నికోబార్ దీవుల్లోని సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు పైలట్లు, అయిదుగురు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం సాంకేతిక సమస్య కారణంగా పైలట్ బలవంతంగా విమానాన్ని సముద్రంలో ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని పౌర విమానయాన శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.