న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గోవాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఆ రాష్ట్రంలోని కన్నూరు, కాసరగోడ్ జిల్లాల్లో రెడ్ అలర్ట్, ఏడు జిల్లాల్లో భారత వాతావరణ శాఖ ఆరంజ్ అలర్ట్ను జారీ చేసింది. లోతట్టు ప్రాంతాలు నీటమునగడంతో నిరాశ్రయులను శిబిరాలకు తరలించారు. దేశ రాజధాని ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్జాం అయింది.
ప్రగతి మైదాన్, జల విహార్, ఆజాద్ మార్కెట్, సద్నగర్, షాపూర్, రాజిందర్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. గోవాలో వరద నీటిలో ఓ మహిళ కొట్టుకుపోయింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముంబైలోని దాదర్, మహిం, ఖర్, మాతుంగ, కుర్లా తదితర ప్రాంతాల్లో 70 సెం.మీ వర్షపాతం నమోదైంది. సియోన్ ప్రాంతంలో వరద నీరు చేరుకోవడంతో బస్సులను దారి మళ్లించారు.