చెన్నై: తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, మధురై, కడలూరు, తిరువళ్లూరు, కోయంబేడు, కాంచీపురం, చెంగల్పట్టులో ఎడతెరపిలేకుండా వాన పడుతున్నది. భారీవర్షాలకు మైలాడుదురై సహా రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. వరద పోటెత్తడంతో చెరువు కట్టలు తెగిపోవడంతో రోడ్లు ధ్వంసమయ్యాయి. ఊటీ ఘాట్రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోయంబత్తూరులోని డ్యామ్లు పూర్తిగా నిండిపోయాయి.
ఏకధాటిగా కురుస్తున్న వానలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. చెన్నైలో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలుచోట్ల పంట పొలాలు నీట మునిగాయి. రోడ్లపై భారీగా వరదనీరు చేరడంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేడు చెన్నై సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
#WATCH | Tamil Nadu: Places across Chennai receive moderate to heavy rainfall, visuals from Koyambedu that is experiencing heavy rainfall.
As per IMD's forecast, Chennai to experience thunderstorm with rain today. pic.twitter.com/ZLAcjqxFnJ
— ANI (@ANI) November 13, 2022