మనాలి: హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్రధాన నదులు పొంగిపొర్లుతున్నాయి. ఇక హిమాచల్(Himachal Pradesh Floods)లో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. హిమాలయాల్లో ఉన్న నదులన్నీ ఉగ్రరూపం దాల్చాయి. మనాలి వద్ద ఉన్న బియాస్ నది ఉప్పొంగుతోంది. వేగంగా ప్రవహిస్తున్న ఆ నది ధాటికి.. టూరిస్టులకు చెందిన కార్లన్నీ కొట్టుకుపోతున్నాయి. మనాలిలో బియాస్ నది సమీపంలో పార్క్ చేసిన కార్లన్నీ ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. నీరు, బురద ఒక్కసారిగా కొట్టుకురావడంతో.. కార్లు కూడా ఆ బురద నీటిలోనే మాయం అయ్యాయి.
🚨#UPDATE: Several cars washed away by floods in Manali, Himachal Pradesh, #India pic.twitter.com/z21EtTlOwE
— World Source News 24/7 (@Worldsource24) July 9, 2023
వర్షాలు.. వరదలు.. కొండచరియలు విరిగిపడడం వల్ల.. హిమాచల్లో ఇప్పటికే 19 మంది మృతిచెందారు. రికార్డు స్థాయిలో అక్కడ వర్షం కురిసింది. ఆకస్మిక వరదల వల్ల భారీ స్థాయిలో నష్టం జరిగింది. పలు ప్రాంతాల్లో ఇండ్లు కూడా కొట్టుకుపోయాయి. రోడ్లు, బ్రిడ్జ్లు ధ్వంసం అయ్యాయి.
Narrow escape of a car at Kalka-Shimla National Highway at Sanwara. #Heavyrainfall #Himachal pic.twitter.com/LmKHfzuYQ2
— Upendrra Rai (@UpendrraRai) July 9, 2023
పంజాబ్, హిమాచల్లో స్కూళ్లను మూసివేశారు. ఆర్మీని అలర్ట్లో ఉంచారు. పలు చోట్ల క్లౌడ్బస్ట్ కావడంతో.. కొండచరియలు విరిగిపడుతున్నాయి. హిమాచల్లో 828 రోడ్లను, మూడు జాతీయ హైవేలను మూసివేశారు. హిమాచల్ ప్రదేశ్ను ఆదుకోవడం కోసం పీఎం కేర్స్ ఫండ్ నుంచి నిధుల్ని విడుదల చేయాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.