న్యూఢిల్లీ : మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న క్రమంలో ఈ వైరస్పై భయాందోళనలు అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు ప్రబలిన సమయంలోనే దీన్ని ఎదుర్కొనేందుకు భారత్ సన్నాహాలు చేపట్టిందని వివరించారు.
మంకీపాక్స్ భారత్ సహా ప్రపంచానికి కొత్త వ్యాధి ఏమీ కాదని, 1970ల్లోనే ఆఫ్రికా నుంచి పలు కేసులు వెలుగుచూశాయని చెప్పారు. మంకీపాక్స్పై ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రత్యేకంగా దృష్టి సారించిందని, భారత్లోనూ మంకీపాక్స్ను భారత్ కూడా నిశితంగా గమనిస్తూ దీటైన చర్యలు చేపడుతున్నని మంత్రి మన్సుక్ మాండవీయ రాజ్యసభకు తెలిపారు.
భారత్లో ఇప్పటివరకూ 8 మంకీపాక్స్ కేసులు బయటపడ్డాయని, వీరిలో ఐదుగురికి విదేశీ ట్రావెల్ చరిత్ర ఉందని అన్నారు. మంకీపాక్స్పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపడతామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరపున నీతిఆయోగ్ సభ్యుడి అధ్యక్షతన టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామని చెప్పారు.