న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సమావేశం నిర్వహించారు. కొవిడ్ పరీక్షలు, టీకాల డేటాను సకాలంలో పంపాలని సూచించారు. ఇటీవల కాలంలో వైరస్ తగ్గుముఖం పట్టిన రాష్ట్రాల్లో పరీక్షల సంఖ్య పెంచడంపై దృష్టి పెట్టాలని చెప్పారు.
ప్రస్తుతం పెద్ద సంఖ్యలో జనం హోం ఐసోలేషన్లోకి వెళ్తున్నారని, ఈ క్రమంలో జాతీయ మార్గదర్శకాల ప్రకారం వారిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా.. దేశంలో గడిచిన 24 గంటల్లో 2,55,874 మందికి కొవిడ్ సోకింది. ఒకే రోజు 614 మంది మరణించారు. 2,67,753 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతుందని, ఇప్పటి వరకు 162.92కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.