న్యూఢిల్లీ : ఆప్ నేత మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయడంపై దుమారం రేగిన నేపధ్యంలో బీజేపీ లక్ష్యంగా జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామి (Kumaraswamy) తీవ్ర విమర్శలు గుప్పించారు. అవినీతి నేతలను శిక్షించేందుకు ఈ రకంగా చర్యలు చేపడితే కర్నాటకలో పది, పదిహేను కొత్త జైళ్లను బీజేపీ నేతల కోసమే నిర్మించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.
రాజకీయ కుట్రలో భాగంగా కుమారస్వామిని బలి చేశారని కుమారస్వామి ఆరోపించారు. కర్నాటకలో కాషాయ పాలనలో అవినీతి పెచ్చుమీరడంతో కాషాయ నేతల కోసమే అదనంగా జైళ్లను నిర్మించాల్సి ఉందని ప్రస్తుత పరిస్ధితికి అద్దం పడుతూ ఆయన వ్యాఖ్యానించారు.
బీజేపీ నేతలు లక్ష్యంగా తీవ్ర విమర్శలతో కుమారస్వామి విమర్శలతో విరుచుకుపడిన వీడియో వైరల్ అవుతోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడటంతో ఇటీవల జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కుమారస్వామి బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఏప్రిల్ లేదా మే నెలలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Read More :