న్యూఢిల్లీ: బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి.. మోదీ-షా ద్వయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఆ ఇద్దరూ మరో హరేన్ పాండ్యాను చేయరని ఆశిస్తున్నట్టు ట్వీట్ చేశారు.గోద్రా అల్లర్లకు సంబంధించి అప్పటి గుజరాత్ సీఎం మోదీకి, హోం మంత్రి హరేన్ పాండ్యాకు మధ్య విభేదాలు వచ్చాయి. అనంతర కాలంలో పాండ్యాను దుండగులు కాల్చిచంపారు. ఈ హత్యపై రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ‘హత్య’ గురించి తాను మాట్లాడటం లేదని స్వామి వివరణ ఇచ్చారు. కేవలం పక్కన పెట్టడం గురించి మాత్రమే తాను పాండ్యా ప్రస్తావన తెచ్చినట్టు చెప్పారు. ‘నన్ను మరో పాండ్యాను చేయాలని మోదీ-షా ద్వయం ప్రయత్నించరని భావిస్తున్నాను. అదే జరగనున్నట్టయితే నేను నా మిత్రులను హెచ్చరించాల్సి ఉంటుంది’ అని స్వామి పేర్కొన్నారు.