న్యూఢిల్లీ, మార్చి 22: 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో మాజీ టెలికం మంత్రి ఏ రాజా, ఇతరులను నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాల్ చే స్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. 2018లో సీబీఐ దా ఖలు చేసిన అప్పీల్ను కోర్టు దాదాపు ఆరేండ్ల తర్వాత అనుమతించడం గమనార్హం.
యూపీఏ ప్రభుత్వ హ యాంలో 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపు కుంభకోణం కేసు వెలుగుచూసిన విషయం విదితమే. 2జీ స్కామ్కు సంబంధించి సీబీఐ, ఈడీ కేసుల్లో 2017, డిసెంబర్ 21న ఏ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి, ఇతరులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ 2018, మార్చి 19న ఈడీ, 2018, మార్చి 20న సీబీఐ హైకోర్టులో పిటిషన్లు వేశాయి.