ముంబై: తనకు తన కుటుంబాన్ని కలిసే హక్కుందని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, శరద్పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. శనివారం ఉదయం శరద్ పవార్ నివాసానికి వెళ్లిన ఆయనను మీడియా పలుకరించగా పై వ్యాఖ్యలు చేశారు. శరద్పవార్ అన్న కొడుకు అయిన అజిత్పవార్ ఇటీవల ఎన్సీపీని చీల్చి ఏక్నాథ్ షిండే సర్కారులో ఉపముఖ్యమంత్రిగా చేరారు.
అప్పటి నుంచి బాబాయ్, అబ్బాయికి మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం శరద్పవార్ ఇంటికి అజిత్పవార్ రావడం చర్చనీయాంశమైంది. దీనిపై అజిత్పవార్ను మీడియా ఆరా తీయగా.. తన కుటుంబాన్ని కలిసే హక్కు తనకు ఉందని అన్నారు. మా చిన్నమ్మ ఇటీవల అనారోగ్యానికి గురైందని, శుక్రవారం డిశ్చార్జి కావడంతో ఇంటికి వచ్చి చూసి వెళ్తున్నానని చెప్పారు.