నుహ్: హర్యానాలోని నుహ్లో అల్లరి మూక ఏకంగా మహిళా జడ్జీపైనే దాడి చేసింది. బాధితురాలైన అడిషనల్ చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ అంజలి జైన్ గత సోమవారం తన మూడేండ్ల కూతురితో కలిసి బయటకు రాగా 150 మందితో కూడిన అల్లరి మూక వారిపై రాళ్ల దాడి చేసింది. కాల్పులు కూడా జరిపింది. వారు దగ్గర్లో ఉన్న వర్క్ షాపులో దాక్కున్నారు. కొందరు అడ్వకేట్లు వారిని రక్షించారు. మరుసటి రోజు చూడగా కారు కాలిపోయింది.