జైపూర్ : ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే కొవిడ్ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే కలిసి ఓ వివాహ వేడుకలో పాల్గొని ఫోక్ సాంగ్స్కు ప్టెప్పులేశారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఎంపీ కిరోడి లాల్ మీనా, ఎమ్మెల్యే ఇందిరా మీనా కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఎంపీ మాస్కు ధరించినప్పటికీ మిగతా వారెవరూ మాస్కులు ధరించలేదు. ఈ ఫంక్షన్లో కనీసం భౌతిక దూరం కూడా పాటించలేదు.