న్యూఢిల్లీ, జూన్ 1: దాదాపు రూ.10,000 కోట్ల చిట్ఫండ్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు జగ్జీత్ చాహల్ను హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్కు చెందిన ఇతడు మూడేండ్లలో నగదు రెట్టింపు అవుతుందని నమ్మించి ప్రజల నుంచి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డాడు. ఇందుకుగాను 2011-12లో ఓ కంపెనీని స్థాపించాడు.
ఈ కంపెనీ 2014లో మూతపడింది. దీంతో మోసపోయామని గ్రహించిన ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న జగ్జీత్ చాహల్ను పట్టుకోవడానికి పోలీసులు ముమ్మరంగా గాలించారు. అయితే పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు గడ్డం, జుట్టు తీసేసి గుర్తుపట్టనట్టుగా మారిపోయాడు. ఈ క్రమంలో జగ్జీత్ చాహల్ గుజరాత్లో తలదాచుకున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు.