న్యూఢిల్లీ: హర్యానాలో ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న కేసులో.. ఆ రాష్ట్ర డీజీపీ(Haryana DGP) శత్రుజీత్ కపూర్ను ప్రభుత్వం లీవ్పై పంపింది. ఆ ఆత్మహత్య కేసులో నమోదు అయిన ఎఫ్ఐఆర్లో శత్రుజీత్ కపూర్ పేరు కూడా ఉన్నది. రోహతక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాను కూడా మార్చుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కపూర్ను లీవ్పై పంపినట్లు సీఎం మీడియా సలహాదారుడు రాజీవ్ జైట్లీ వెల్లడించారు. ఐపీఎస్ పూరన్ కుమార్ తన సూసైడ్ నోట్లో పలువురు ఆఫీసర్ల పేర్లను ప్రస్తావించారు. దాంట్లో కపూర్, బిజార్నియాతో పాటు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. దళితులపై దాడులు జరుగుతున్నట్లు విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. హర్యానాలోని బీజేపీ సర్కారు డీజీపీని మార్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
పూరన్ ఆత్మహత్య వివాదం నేపత్యంలో అక్టోబర్ 17వ తేదీన సోనిపాట్లో జరగాల్సిన మోదీ ర్యాలీని రద్దు చేశారు. పూరన్ పోస్టుమార్టమ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో మోదీ ర్యాలీపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. 2023, ఆగస్టు 16వ తేదీన హర్యానా డీజీపీగా శత్రుజిత్ కపూర్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన రెండేళ్ల కాలపరిమితి ముగిసింది. అయితే కపూర్ స్థానంలో కొత్త డీజీపీ నియామకంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం సీనియార్టీ వరుసులో 1989 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ మొహమ్మద్ అఖిల్ ముందున్నారు.