చండీగఢ్: ఇకపై తన కార్లకు వీఐపీ నంబర్లు ఉపయోగించనని హర్యానా ముఖ్యమంత్రి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) ప్రకటించారు. తన కాన్వాయ్లోని నాలుగు వాహనాలకు వీఐపీ నంబర్లను ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. వాటిని సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఖట్టర్ వెల్లడించారు. ఈ మేరకు హర్యానా మోటార్ వెహికల్స్ రూల్స్-1993లో సవరణ చేస్తున్నామన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 179 వాహనాలకు కేటాయించిన వీఐపీ నంబర్లను వేలానికి పెడతామని వెల్లడించారు.
దీంతో వీఐపీ వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వాటిని ఈ-వేలం ద్వారా కేటాయిస్తామన్నారు. ఫ్యాన్సీ నంబర్లను కొనుగోలుచేయాలనుకునేవారికి ఇది మేలుచేస్తుందన్నారు. వేలం ద్వారా రూ.18 కోట్ల ఆదాయం సమకూరుతుందని చెప్పారు.