చండీగఢ్: హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తన మంత్రివర్గాన్ని మంగళవారం విస్తరించనున్నారు. కొత్తగా 9 మందికి మంత్రి పదవులు దక్కుతాయని తెలుస్తున్నది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు రాజ్భవన్లో కొత్త మంత్రులు ప్రమాణం చేస్తారని సీఎం కార్యాలయం తెలిపింది. ‘డిసెంబర్ 28, 2021న హర్యానా మంత్రివర్గం విస్తరణ. హర్యానా రాజ్భవన్లో సాయంత్రం 4 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది’ అని సోమవారం పేర్కొంది.
కాగా, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి చెందిన తోహానా ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ బబ్లీ, ప్రస్తుత హర్యానా అసెంబ్లీ స్పీకర్, పంచకుల ఎమ్మెల్యే జియాన్ చంద్ గుప్తా, హిసార్ ఎమ్మెల్యే డాక్టర్ కమల్ గుప్తాకు మంత్రి పదవులు దక్కవచ్చని సమాచారం. 2019లో హర్యానాలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ-జేజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో ఇది రెండో మంత్రివర్గ విస్తరణ.