చండీగఢ్, ఏప్రిల్ 5: చండీగఢ్ను తమ రాష్ట్రంలో కలపాలంటూ పంజాబ్ అసెంబ్లీలో చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా హర్యానా అసెంబ్లీ ఓ తీర్మానాన్ని ఆమోదించింది.
పంజాబ్ తీర్మానాన్ని ఖండించింది. పంజాబ్ డిమాండ్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కేంద్రాన్ని కోరింది. పంజాబ్లోని హిందీ మాట్లాడే ప్రజలుండే ప్రాంతాలను హర్యానాలో కలపాలని డిమాండ్ చేసింది.