న్యూఢిల్లీ: గోమూత్రం తాగొద్దని, అందులో 14 రకాల హానికారక బ్యాక్టీరియాలు ఉన్నాయని భారత పశు వైద్య పరిశోధనా మండలి (ఐవీఆర్ఐ) తెలిపింది. గోమూత్రంపై చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
‘మేం మూడు రకాల గోవులు, బర్రె, మనిషి మూత్రాలను పరీక్షించాం. గో మూత్రం మనుషులు తాగడానికి పనికిరాదని తేలింది’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన భోజ్రాజ్ సింగ్ వెల్లడించారు. అయితే గో మూత్రంపై 25 ఏండ్లుగా పరిశోధన చేస్తున్న ఐవీఆర్ఐ మాజీ సంచాలకులు ఆర్ఎస్ చౌహాన్ మాట్లాడుతూ స్వేదనం (డిస్టిల్డ్) చేసిన గో మూత్రం మనుషుల రోగ నిరోధక శక్తిని పెంచుతుందని, తాగడానికి సిఫారసు చేయొచ్చన్నారు.