Hemant Soren | మాజీ సీఎం హేమంత్ సోరెన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ స్పందన తెలుపాలంటూ జార్ఖండ్ హైకోర్టు మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)ని ఆదేశించింది. భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో జనవరి 31న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి.. కేసును త్వరగా విచారించాలని కోరారు. జస్టిస్ ఆర్ ముఖోపాధ్యాయతో కూడిన ధర్మాసనం ఎదుట సోరెన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.
కేసులో సమాధానం ఇవ్వాలని ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను జూన్ 10వ తేదీకి వాయిదా వేసింది. ఎనిమిదిన్నర ఎకరాల భూ కుంభకోణానికి సంబంధించిన ఏ పత్రంలోనూ తన పేరు లేదని.. సోరెన్ పిటిషన్లో కోర్టుకు తెలిపారు. భూమి తనకు (హేమంత్ సోరెన్) చెందిందేనని కొందరు వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలంపై మాత్రమే ఈడీ ఆధారపడిందని.. అలాంటి ఆ ప్రకటనలను ధ్రువీకరించే పత్రాలు లేవీ లేవన్నారు.
జనవరి 31న అరెస్టుకు ముందు పదవికి రాజీనామా చేసిన హేమంత్ సోరెన్ తాజాగా జార్ఖండ్ రాజధాని రాంచీలోని బిర్సా ముండా జైలులో ఉన్నారు. రాంచీలో ఓ ప్లాట్ కోసం భూమి పత్రాలను ట్యాంపరింగ్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. భూమికి యజమాని రాజ్కుమార్ పహాన్ అనే వ్యక్తి అని సోరెన్ వాదించారు. హేమంత్ సోరెన్ పేరును పహాన్ ఎక్కడా ప్రస్తావించలేదని, అయితే ఈ భూమి ఆయన (సోరెన్) ఆధీనంలో ఉందని ఈడీ పేర్కొంది.