న్యూఢిల్లీ: హరివంశ్(Harivansh) హ్యాట్రిక్ కొట్టారు. మూడోసారి ఆయన రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్గా ఎన్నికయ్యారు. సభాపక్ష నేత జేపీ నడ్డా తీర్మానం పాస్ చేయగా .. హరివంశ్ ఎన్నిక ప్రక్రియ లాంఛనంగా పూర్తి అయ్యింది. మోజువాణీ ఓటు ద్వారా డిప్యూటీ చైర్మెన్ నియామకం జరిగింది. హరివంశ్ను ఎన్నుకునేందుకు అయిదు తీర్మానాలను పాస్ చేశారు. ఏప్రిల్ 9వ తేదీన రాజ్యసభ సభ్యుడిగా హరివంశ్ రెండో టర్మ్ ముగిసింది.దీంతో డిప్యూటీ చైర్మెన్ పోస్టు ఖాళీ ఏర్పడింది. రాజ్యసభ్య వ్యవహారాల ప్రకారం రూల్ 7 కింద చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్ .. డిప్యూటీ చైర్మెన్ కోసం ఎన్నిక నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రాజ్యసభకు హరివంశ్ను నామినేట్ చేశారు. మూడోసారి డిప్యూటీ చైర్మెన్గా గెలిచిన హరివంశ్కు ప్రధాని మోదీ, విపక్షనేత ఖర్గు కంగ్రాట్స్ తెలిపారు. రాజ్యసభ చరిత్రలో ఓ నామినేటెడ్ సభ్యుడు డిప్యూటీ చైర్మెన్గా ఎన్నిక కావడం ఇదే తొలిసారి. గతంలో హరివంశ్ జర్నలిస్టుగా చేశారు. విపక్షాలకు తగిన సమయాన్ని డిప్యూటీ చైర్మెన్ కేటాయిస్తారని భావిస్తున్నట్లు ఖర్గే చెప్పారు. హరివంశ్ ఎన్నికపై తీర్మానం పాస్ చేసిన సమయంలో సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ వాకౌట్ చేశారు.