న్యూఢిల్లీ: పంజాబ్, చండీగఢ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా హరీష్ ఛౌదరిని నియమించారు. ఆయన నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు పంజాబ్, చండీగఢ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా కొనసాగిన హరీష్ రావత్ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. అదేవిధంగా ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ పదవి నుంచి కూడా ఆయనను తొలగించారు.
అయితే, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడిగా మాత్రం ఆయన కొనసాగుతారని ఏఐసీసీ ప్రకటనలో తెలిపారు. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీగా హరీష్ రావత్ అందించిన సేవలకుగాను ఆయనను అభినందిస్తున్నట్లు ఏఐసీసీ పేర్కొన్నది.