జైపూర్ : రాజస్థాన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ సంతోషం చేసిన ఆయన.. ఐక్యతా రాగాన్ని అందుకున్నారు. గతేడాది సీఎం అశోక్ గెహ్లాట్పై బహిరంగంగా తిరుగుబాటు చేసి.. అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టించిన ఏడాది తర్వాత ఆదివారం ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2023 ఎన్నికల్లో గెలవాలంటే ఐక్యంగా బీజేపీతో పోరాడాలన్నారు. ఈ రోజు కొత్తమంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు.
చర్చల ద్వారా పార్టీ, నాయకత్వం తీసుకున్న ముందడుగు రాష్ట్రవ్యాప్తంగా సానుకూల సందేశాన్ని పంపుతుందని విలేకరులతో అన్నారు. కొత్త కేబినెట్లో 15 కొత్త ముఖాలుండగా.. వారిలో నలుగురికి జూనియర్ మంత్రులుగా బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ సందర్భంగా తన ఐదుగురు విధేయులకు మంత్రివర్గంలో చోటు కల్పించడంపై ప్రశ్నించగా.. కాంగ్రెస్ సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ నాయకత్వంలో పని చేస్తోంది.
పార్టీలో ఎలాంటి వర్గాలు లేవు, (కేబినెట్ పునర్వ్యవస్థీకరణ) నిర్ణయాలను అందరూ కలిసి తీసుకుంటున్నారన్నారు. మార్పు స్థిరంగా ఉంటుందని, సమీప భవిష్యత్లో మరిన్ని మార్పులు ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలకు కేవలం 22 నెలల సమయం ఉందన్నారు. బీజేపీ విధానాలను ప్రజలు తిరస్కరించారు. ప్రధానమంత్రి దాన్ని (వ్యవసాయ చట్టాలను) ఉపసంహరించుకోవడం చూశాం.
వ్యవసాయ చట్టాలు ఇది విపరీతమైన రాజకీయ ఒత్తిళ్లను సూచిస్తోందన్నారు. కొత్త మంత్రివర్గంలో నలుగురు దళిత మంత్రులకు చోటు కల్పించారని, చాలా కాలంగా మా ప్రభుత్వంలో దళితుల ప్రాతినిధ్యం లేదని అన్నారు. రాజస్థాన్ పాలనలో మహిళల పాత్ర కూడా కీలకంగా ఉంటుందని సచిన్ పైలట్ తెలిపారు. యూపీలో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల్లో 40శాతం మంది మహిళలకు సీట్లు కేటాయిస్తామని ప్రకటించిన ప్రియాంక గాంధీని ప్రశంసించారు.