ముంబై : అమరావతి ఎంపీ నవనీత్ రాణా, రవి రాణా దంపతులపై ముంబై సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇద్దరు బెయిల్ షరతులను ఉల్లంఘించారని, బెయిల్ను రద్దు చేయాలని ఆరోపిస్తూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. హనుమాన్ చాలీసా వివాదం నేపథ్యంలో నవనీత్ రాణా దంపతులకు కోర్టు షరతులతో బెయిల్ను మంజూరు చేసిన విషయం తెలిసిందే.
ఈ పిటిషన్పై ఈ నెల 27న విచారణ చేపట్టనున్నది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసం మాతోశ్రీ ఎదుట హనుమాన్ చాలీసా పటిస్తామని నవనీత్ దంపతులు ప్రకటించగా.. ఆ తర్వాత ఇద్దరిని ముంబై పోలీస్లు ఏప్రిల్ 23న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం దంపతులిద్దరు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. తిరస్కరించింది. ఆ తర్వాత ముంబై సెషన్స్ కోర్టు ఇద్దరికీ రూ.50వేల పూచీకత్తుతో పాటు పలు షరతులతో బెయిల్ను మంజూరు చేసింది.
మీడియాతో మాట్లాడవద్దని, కేసు విచారణకు ఆటంకం కలిగించకూడదని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, బెయిల్ను రద్దు చేసేలాంటి క్రిమినల్ నేరానికి పాల్పడకూడదని కోర్టు ఆదేశించింది. షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ను రద్దు చేస్తామని హెచ్చరించింది. మరోవైపు ఇద్దరిని విచారించాలంటే.. 24 గంటల ముందుగా నోటీసులు ఇవ్వాలని పోలీసులకు కోర్టు సూచించింది.