China Ship Yuan Wang 5 | హంబాంతోట నౌకాశ్రయంలో లంగర్ వేసేందుకు చైనా రీసెర్చ్ నౌక యువాన్ వాంగ్-5కు శ్రీలంక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 16-22 మధ్య హంబంతోట నౌకాశ్రయానికి వచ్చేందుకు శ్రీలంక విదేశాంగ మంత్రిత్వశాఖ మళ్లీ అనుమతి ఇచ్చినట్లు నౌకాయాన శాఖ మంత్రి నిర్మల్ పీ సిల్వ శనివారం తెలిపారు. తొలుత ఈ నౌక గురువారం నాడే పోర్ట్కు రావాల్సి ఉంది.
హైటెక్నాలజికల్ రీసెర్చ్ నౌక.. యువాన్ వాంగ్-5ను హంబాంతోట నౌకాశ్రయానికి అనుమతించొద్దని భారత్ కోరింది. భారత్కు వ్యతిరేకంగా నిఘా కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కొలంబోలో భారత్ ఫిర్యాదు చేసింది.
యువాన్ వాంగ్-5 నౌక రీసెర్చ్ సర్వే నౌక అని ఇంటర్నేషనల్ షిప్పింగ్ అండ్ అనలిటిక్స్ వెబ్సైట్లు చెబుతున్నాయి. కానీ భారత్ మీడియా మాత్రం ఇది డ్యుయల్-యూజ్ నిఘా నౌక అని వాదిస్తున్నది. శ్రీలంక నుంచి హిందూ మహాసముద్రంపై పట్టు పెంచుకునేందుకు చైనా ప్రయత్నిస్తున్నదని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. శ్రీలంకలో ఈ నౌకను నిలిపి, భారత్లో మిలిటరీ సంస్థలపై నిఘా పెట్టేందుకు చైనా ప్రయత్నిస్తుందని ఇండియా ఆందోళన.
‘యువాన్ వాంగ్-5’.. క్షిపణి, అంతరిక్షం, ఉపగ్రహాల కదలికలను ట్రాక్ చేసే సామర్థ్యం ఉంది. చేయగలదు. 750 కిమీలకు పైగా దూరంలో గల ప్రాంతాలపై నిఘా పెట్టగల సత్తా దీని సొంతం. అంటే ఆంధ్రప్రదేశ్తోపాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఆరు నౌకాశ్రయాలపై స్పై చేయగలుగుతుంది. అందుకే హంబంతోట పోర్ట్కు యువాన్ వాంగ్-5 నౌక రావడానికి భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది.