Hajj Yatra | శ్రీనగర్: హజ్ యాత్ర -2024కు ఆన్లైన్ దరఖాస్తులను భారత హజ్ కమిటీ ఆహ్వానించింది. ఈ నెల 4 నుంచి దరఖాస్తులు అందుబాటులో ఉంచామని, వాటిని సమర్పించేందుకు తుది గడువు ఈ నెల 20 అని తెలిపింది. www.hajcommittee.gov.in వెబ్సైట్ను సందర్శించి, హజ్ విధానాన్ని తెలుసుకోవాలని వివరించింది.
దరఖాస్తుదారుల వద్ద మెషిన్ రీడబుల్ ఇంటర్నేషనల్ పాస్పోర్టు ఉండాలని..అది ఈ నెల 20న లేదా అంతకు ముందు జారీ చేసినది అయి ఉండాలని, 2025 జనవరి 31 వరకు చెల్లుబాటయ్యేది అయి ఉండాలని తెలిపింది.