చెన్నై, ఫిబ్రవరి 12: రాష్ట్రంలో హైవేలు అధ్వానంగా మారాయని, చెన్నై నుంచి రాణిపేట జాతీయ రహదారి ఘోరంగా ఉన్నదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. దీంతో జిల్లాల పర్యటనకు తాను రైలు మార్గంలో వెళ్లాల్సి వస్తున్నదని చెప్పారు.
ఈ మేరకు కేంద్ర మంత్రి గడ్కరీకి లేఖ రాశారు. చెన్నై-రాణిపేట (ఎన్హెచ్-4) హైవే దుస్థితిని పార్లమెంట్లో ఎంపీ దయానిధి మారన్ తమ దృష్టికి తీసుకొచ్చారని లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలో నిర్మించే ఆరులైన్ల రహదారులను వేగవంతం చేయాలని కోరారు.