VK Sasikala | తాను కులం చూసి ఉంటే ఎడప్పాడి పళనిస్వామిని ( Edappadi Palaniswami) ముఖ్యమంత్రిగా తీసుకొచ్చేదానినే కాదని తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ (VK Sasikala) అన్నారు. శుక్రవారం చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈనెల 24న తిరుచ్చిలో పన్నీర్ సెల్వం (Panneerselvam) నిర్వహిస్తున్న మహాసభకు వెళ్తారా..? అన్న విలేకరుల ప్రశ్నకు ఆమె స్పందిస్తూ..
‘నాకు ఆహ్వానం పంపితే అందరికీ చెప్పకుండా వెళ్తానా..? ముందైతే ఆహ్వానం రానివ్వండి. ఆ తర్వాత చూడండి. అందరికీ నన్ను అర్థం చేసుకునే రోజు వస్తుంది. ఈ విషయం నేను ఓపీఎస్ (పన్నీర్ సెల్వం) ను ఉద్దేశించి చెప్పండ లేదు. సాధారణంగా అందరి గురించి చెబుతున్నా. నాకు కులమత, ప్రాంతీయ బేధాలు లేవు’ అని శశికళ అన్నారు.
Also Read..
Corona India | 24 గంటల్లో 10,753 కొత్త కేసులు.. 27 మరణాలు
Joe Biden: 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ప్లాన్ ఉంది: బైడెన్
Japan PM Kishida: జపాన్ ప్రధానిపై బాంబు దాడి.. కిషిదాకు తప్పిన ముప్పు