బెంగళూరు, జూలై 28: కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్కు బెంగళూరు విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. గురువారం హైదరాబాద్కు వెళ్లాల్సిన ఆయన్ను ఎక్కించుకోకుండానే ఏఐఎక్స్ కనెక్ట్(ఎయిర్ ఆసియా) విమానం వెళ్లిపోయింది.
మధ్యాహ్నం 2.05 గంటలకు వెళ్లాల్సిన విమానం వద్దకు గవర్నర్ ఒక్క నిమిషం ఆలస్యంగా చేరుకొన్నారని.. అయితే సిబ్బంది లోపలికి అనుమతించలేదని పేర్కొంటూ ప్రొటోకాల్ ఉల్లంఘనపై గవర్నర్ కార్యాలయ అధికారి ఫిర్యాదు చేశారు.